విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో భేటీ అయ్యారు. విజయవాడలో జనసేన కార్యాలయంలో సమావేశమైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పవన్ పలు అంశాలపై చర్చిస్తున్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పవన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోరాటంపై కార్యాచరణను రూపొందించనున్నారు.