లక్నో : ఉత్తర్ ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ గోవింగ్ చౌధురి నేడు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతితో సమావేశమయ్యారు. ఉత్తర్ ప్రదేశ్లోని రెండు లోక్సభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లొ బిఎస్పితో జత కలిసిన ఎస్పి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ గోవింద్ మర్యాదపూర్వకంగా మాయావతిని కలిశారు.