న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేయాలని లేనిపక్షంలో సభా కార్యక్రమాలను అడ్డుకుంటామని టిడిపి ఎంపి సిఎం రమేశ్ అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపిలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం రమేశ్ మాట్లాడుతూ గత రెండు మూడు నెలలనుంచి తాము ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.