న్యూఢిల్లి : దేశ రాజధానిలో దుకాణాలను సీల్ చేస్తున్న అంశంపై ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీనుంచి అజయ్ మాకెన్, అర్వీందర్ సింగ్ లవ్లీ తదితరులు హాజరయ్యారు. బిజెపికి చెందిన మనోజ్ తివారీని సమావేశానికి ఆహ్వానించినప్పటికీ బిజెపి నాయకులెవరూ హాజరు కాలేదు.