న్యూఢిల్లి : సభా కార్యక్రమాలు జరిగేలా సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు వివిధ అంశాలపై చర్చకు నోటీసులిచ్చాయని, ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిందని, చర్చకు తాను అనుమతినిచ్చానని ఆయన అన్నారు. అయినప్పటికీ సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.