బెంగళూరు : బస్టాండ్లో ఒంటరిగా ఉన్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మగాళ్లను ఆమె చితకబాదారు. ఓ మహిళ తన సొంత గ్రామానికి వెళ్లేందుకు హుబ్లీ బస్టాండ్కు మార్చి 11న రాత్రి వచ్చింది. అయితే బస్సు అప్పటికే వెళ్లిపోవడంతో.. ఆమె బస్టాండ్లోనే ఉండిపోయింది. ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆవిడ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన చెప్పుతో చితక్కొట్టింది. ఆ తర్వాత బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.