ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీలర్ల మెడƒపై కత్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 12:17 AM

  -1 నుంచి నగదు రహితం అమలు చేయాల్సిందే.
  - హుకుం జారీచేసిన జిల్లా అధికారులు
నరసాపురం,మేజర్‌న్యూస్‌ః రేషన్‌ డీలర్ల పీకపై జిల్లా ఉన్నతాధికారులు కత్తి పెట్టారు. రాష్ర్టంలో ఎక్కడ అమలుజరగకున్నప్పటికి మన జిల్లాలోనే ఇటువంటి అంక్షలు విధిస్తున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 1 వ తేది నుంచి నగదు లేకుండా సరుకులు సరఫరా చేయాలని డీలర్లును ఆదేశించారు. జనవరి నెల నుంచి నగదు రహితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు వారించి అమలులోకి తీసుకోచ్చినప్పటికి అది సాధ్యం కాలేదు. అందరికీ బ్యాంక్‌ అకౌంట్‌లు లేకపోవడం, అకౌంట్‌లు ఉన్న వాటిలో నగదు లేకపోవడం తదితర కారణాలు వల్ల అధికారులు దానిని ఆ రెండు నెలలుగా వాయిదా వేశారు. ప్రతినెల 1వ తేది నుంచి 5వ తేది వరకు రేషన్‌ దుకాణాలు ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. నగదు రహితం విషయంలో సాధ్యసాధ్యాలను పరిశీలించి అమలుచేయాలని సంబంధిత శాఖామంత్రి పరిటాల సునిత తెలిపారు. సాంకేతిక సమస్యలు,  బ్యాంకు అకౌంట్‌లలో నగదు సమస్యలు పరిష్కారం చేయకుండా డీలర్ల పీకపై కత్తి పెడితే ఎలా సాధ్యమంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగిన విడియో కాన్‌‌పరెన్‌‌సలో డీలర్లతో మాట్లాడిన జిల్లా ఉన్నతాధికారులు నగదు రహితం అమలు చేయాల్సిందే, ఈ సమస్యను ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్తే ఊరుకోబోమని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. తమకు ఏ సమస్య వచ్చిన సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తామని, జిల్లా అధికారులు అలా చెబితే ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ప్రభుత్వం మెప్పు పొందేందుకు అదికారులు పోటీపడి డీలర్లపై, సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .ప్రభుత్వం ద్వార సరఫరా అవుతున్న సరుకులను సకాలంలో అందించి సేవలు  అందిస్తున్న తమపై ప్రతాపం చూపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తహశీల్దార్లు సైతం రేషన్‌ సరుకులు సరఫరాలో ప్రభుత్వం నిర్ణయానికి అవాక్కయిపోతున్నారు. నరసాపురం డివిజన్‌లోని 12 మండలాలకు గాను 657 రేషన్‌ షాపులు ద్వార 3,30 లక్షల మంది రేషన్‌కార్డు లబ్దిదారులకు సరుకులు సరఫరా చేయాల్సి ఉంది. బ్యాంకు ఎకౌంట్‌లు తెరిపించడం, మరుగుదొడ్లు కట్టించడం తదితర పనులు చేయించేందుకు జిల్లా అధికారులు కు్ట్ర పన్నుతున్నారని, అసలు పని మానేసి వేరే పని చేయాల్సి వస్తుందిని డీలర్లు అంటున్నారు. వ్యక్తిగతనిర్ణయాలు కుటుంబాలకు అమలు జరుపుకోవలే తప్ప ప్రభుత్వ పథకాల అమలకు కాదని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలుచేస్తుంటే జిల్లా అధికారుల తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కొత్తగా ఇవ్వబోతున్న యంత్రాలు ఏ విధంగా ఉపయోగించాలో కనీస శిక్షణ ఇవ్వకుండా అమలుచేయమనడం హాస్యాస్పందంగా ఉంటుందని పలువురు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com