న్యూఢిల్లి : లోక్సభ రేపటికి వాయిదా పడింది. సభ మొదటిసారి వాయిదా పడి తిరిగి ప్రారంభమైన అనంతరం విపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. విపక్షాల నినాదాల మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ బిల్లులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు బిల్లులు ప్రవేశపెట్టిన అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.