అంత కాన్ఫిడెన్స్ ఉంటే నో కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు విపక్ష నేత జగన్ ను ప్రశ్నించారు. తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రధాని మోడీపై విశ్వాసం ఉందన్న విజయసాయి మాటలను ఉటంకిస్తూ అంత విశ్వాసం ఉంటే అవిశ్వాసమెందుకని ప్రశ్నించారు. ఒక వైపు విశ్వాసం ఉందంటూ మరోవైపు అవిశ్వాసమంటూ డొంకతిరుగుడేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం రాజీపడదని ఆయన అన్నారు. పార్లమెంటు ఉభయ సభలలోనూ ఆందోళనలను ఉదృతం చేయాలని ఆయన ఎంపీలను ఆదేశించారు.