న్యూఢిల్లి : దేశంలో సోలార్ టెక్నాలజీ మిషన్ను ప్రారంభిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. ఇక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ సోలార్ అలియెన్స్ సదస్సులో మోడీ ప్రసంగించారు. సూర్యుడిని ప్రపంచానికి ఆత్మగా వేదాలు అభివర్ణించాయని మోడీ చెప్పారు. జీవనానికి సూర్యుడే ఆధారమని భావిస్తారని ఆయన అన్నారు. వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ ప్రాచీన భావజాలాన్ని అందిపుచ్చుకుని మార్గాలన్వేషించాలని ఆయన చెప్పారు.