ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 11, 2018, 08:23 AM

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మాధవనగర్ వద్ద బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, బస్సు ఒకదాన్ని మరోటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందస్తున్నారు. మృతులు కేరళలోని కోవపాడు వాసులుగా గుర్తించారు. తిరుమల స్వామివారి దర్శనానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com