చిత్తూరు: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మాధవనగర్ వద్ద బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, బస్సు ఒకదాన్ని మరోటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందస్తున్నారు. మృతులు కేరళలోని కోవపాడు వాసులుగా గుర్తించారు. తిరుమల స్వామివారి దర్శనానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.