విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనుకాడేది లేదని, ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. కేంద్రమంత్రులను రాజీనామా చేయించడం... సీఎం చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయమని కొనియాడారు. ‘‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు... మన హక్కును మనం కోరుతున్నాం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ప్రజలను మోసం చేసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది’’ కేశినేని నాని దుయ్యబట్టారు.