ఏపీకి ఇచ్చిన ప్యాకేజీ అమలు చేస్తారని నాలుగేళ్లు వేచి చూశామని.. అయితే కేంద్రం మాత్రం మొండిచేయి చూపించిందని మంత్రి సుజయకృష్ణ రంగారావు చెప్పుకొచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన..చివరి బడ్జెట్లో కేంద్రం ఏపీకి మొండిచేయి చూపిందే తప్ప ఆదుకునే ప్రయత్నం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వమంటూనే 11 రాష్ట్రాలకు హోదా ఎలా పొడిగించారని సుజయకృష్ణ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు.