వాషింగ్టన్ : ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో భేటీ అయ్యేందుకు అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్లు ద.కొరియా, అమెరికా అధికారులు వెల్లడించారు. ఉ.కొరియా అణు కార్యక్రమాలపై దాదాపు కొన్ని నెలలపాటు కొనసాగిన హెచ్చరికలు, బెదిరింపుల పర్వం అనం తరం ఇరువురు నేతలూ భేటీకి సిద్ధం కావటం విశేషం. ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడెవరూ ఉ.కొరియా అధినేతలతో భేటీ కాలేదు. ద.కొరియా జాతీయ భద్రతా వ్యవస్థ డైరెక్టర్ చుంగ్ యూ యంగ్ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లా డుతూ ఈ విషయం వెల్లడించారు. అంతకు ముందు ఆయన అధ్యక్షుడు ట్రంప్ను కలిసి ఇటీవల ఉ.కొరియాలో తమ దేశ ప్రతినిధి బృందం జరిపిన పర్యటన వివరాలను తెలియచేశారు. దాదాపు దశాబ్దాల పాటు బద్ధ వైరులుగా కొనసాగిన అమె రికా ఉ.కొరియా దేశాల మధ్య జరుగనున్న ఈ భేటీ అనూహ్యమైనదేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఎటువంటి ద్వైపాక్షిక సంబంధాలూ లేవు. 1950-53లో కొనసాగిన కొరియా యుద్ధానంతరం కూడా ఈ రెండూ బద్ధ వైరులుగానే కొనసాగాయి. కొరియా ద్వీపకల్పం అణు నిరాయుధీకరణకు తాను కట్టుబడి వున్నట్లు కిమ్ చెప్పారని చుంగ్ ట్రంప్కు వివరించారు. గత నెలలో జరిగిన శీతాకాలం ఒలింపిక్స్ నేపథ్యంలో ఉభయ కొరియాల మధ్య ఏర్పడిన దౌత్య సంబం ధాలతో కొరియా ద్వీపకల్పంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ద్వితీయార్థంలో ఇరుదేశాల అధినేతలూ శిఖరాగ్ర సదస్సుకు ఇప్పటికే అంగీకరించారు. సాధ్యమైనంత త్వరలో ట్రంప్తో భేటీ కావాలని కిమ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చుంగ్ చెప్పారు. దీనిపై ఆయన్ను అభినందించిన ట్రంప్ తాను కూడా మే నెలలో కిమ్తో భేటీ అవుతానని, కొరియా ద్వీపకల్పంలో శాశ్వత అణు నిరాయుధీకరణకు కృషి చేస్తామన్నారని ఆయన వివరించారు. అయితే ట్రంప్-కిమ్ల భేటీ ఎక్కడ జరుగు తుందన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా మని నిర్ణీత ప్రదేశంలోనే ఈ భేటీ జరుగుతుం దని వైట్హౌస్ వర్గాలు వివరించాయి