అవిశ్వాస తీర్మానం తర్వాత మా ఎంపీల రాజీనామాలు చేస్తారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఈనెల 21న కాదు.. సోమవారమే అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. కేంద్ర మంత్రులుగా అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఏమీ చేయలేకపోయారన్నారు. భోగాపురం విమానాశ్రయం పేరుతో స్థిరాస్తి వ్యాపారం చేయాలని భావించారని బొత్స అన్నారు. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు సంతృప్తిగా లేరని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా కోసమే రాజీనామా చేశామని ఎక్కడా చెప్పుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు ఓ మాట, ఢిల్లీలో ఎంపీలు ఓ మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకే రాజీనామా చేస్తున్నామని ప్రధానికి ఎందుకు చెప్పలేకపోయారని బొత్స ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం అయిపోగానే మా ఎంపీలు రాజీనామా చేస్తారని బొత్స సత్యనారాయణ తెలిపారు. తెదేపా ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టమంటే అప్పుడు పెడతామన్నారు. అవిశ్వాసానికి మద్దతిస్తారో లేదో తేల్చుకోవాల్సింది చంద్రబాబేనన్నారు.