ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రంలో జాతీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 02:18 PM

అమరావతి: కేంద్రంలో జాతీయ పార్టీలు జాతి ప్రయోజనాల కోసం బాధ్యతగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లిdలో చంద్రబాబు మాట్లాడుతూ… జాతీయ రాజకీయాల్లో టీడీపీ కొన్ని ప్రయోగాలు కూడా చేసిందన్నారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలను ఏకం చేసింది టీడీపీ, ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఎన్టీఆర్‌ ఆనాడే శ్రీకారం చుట్టారన్నారు. కేంద్ర, రాష్ట్రాలపై సర్కారియా కమిషన్‌ ద్వారా మార్పులు చేసేలా చేసింది టీడీపీ, ఎన్టీఆరేనన్నారు. పార్లమెంటు తలుపులు మూసి బిల్లు పాస్‌ చేస్తున్నా ఆనాడు బీజేపీ అడ్డుకోలేక పోయిందన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని బీజేపీ కూడా మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తామని చెప్పే బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com