న్యూఢిల్లి : కేంద్రంలో టిడిపి మంత్రులు నేడు తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారు. రాజీనామాలకు ముందుగా వారు పార్లమెంటు ఉభయ సభల్లోనూ తాము రాజీనామాలు చేయడానికిగల కారణాలను వివరించనున్నారు. లోక్సభలో రూల్ 357 కింద, రాజ్యసభలో రూల్ 241 కింద కేంద్ర మంత్రుల ప్రకటన చేయనున్నారు. తమ స్టేట్మెంట్ కాపీలను అన్ని పార్టీల నేతలకు లేఖలు అందజేయనున్నారు. ఎపికి జరిగిన అన్యాయం, రాజీనామాలకు కారణాలపై వారు ఈ స్టేట్మెంట్లో వివరించనున్నారు.