లక్షద్వీప్ : లక్షద్వీప్ దీవుల్లో ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. మేయర్స్కు చెందిన కంటేనర్ షిప్ ప్రమాదానికి గురైంది. లక్షదీవుల్లోని అట్టికి 340 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కంటేనర్ షిప్లో 27 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు 23 మందిని రక్షించారు. గల్లంతైన మరో నలుగురి కోసం అన్వేషిస్తున్నారు.