అమరావతి :రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ ప్యాకేజీ ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. దీనిని పూర్తిగా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. షెడ్యూల్ 9కి సంబంధించిన పని జరుగుతున్నప్పటికీ షెడ్యూల్ 10 విషయంలో ముందుకు సాగడం లేదన్నారు. షెడ్యూల్ 10 సంస్థలకు సంబంధించిన ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలన్న సుప్రీం తీర్పును తెలంగాణ అంగీకరించలేదని, దీంతో ఇది కేంద్రం వద్దకు వెళ్లిందని చంద్రబాబు వివరించారు. కేంద్రం కూడా సరిగ్గా స్పందించలేదని, దీంతో ఇప్పడు దీనిపై కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంను ఆశ్రయించే పరిస్థితి మనకు వచ్చిందని చంద్రబాబు అన్నారు. అన్నిటికీ కేంద్రంమీదే ఆధారపడుతున్నానని నన్న కొందరు విమర్శిస్తున్నానని అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నారు. అన్నిటికీ కేంద్రం మీద ఆధారపడే మనిషిని కాదని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశాను, సైబరాబాద్ నిర్మాణం చేశాను. దానికి కేంద్రం నుంచి ఏమీ సహాయం లేదని చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్రాన్ని విభజన చట్టంలోని హామీల అమలునే కోరుతున్నామని అంతే కానీ అదనంగా ఏమీ అడుక్కోవడం లేదన్నారు. ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం అంటున్నారు. తమిళులు, మళయాలీలు కూడా ఆత్మగౌరవం అంటే ఏం చేయాలంటూ లీకులు ఇస్తున్నారని ఇది సరికాదని చంద్రబాబు అన్నారు. తాను ఏ విషయంలోనూ లాలూచీ పడలేదన్నారు. తనపై ఎటువంటి కేసులూ లేవని చంద్రబాబు చెప్పారు. తెలిసీ తెలియని వారు తాను కేసులకు భయపడుతున్ననని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కష్టపడి పని చేస్తాను, హాయిగా ఆరు గంటలు నిద్రపోతాను అచి చెప్పారు.