ఢిల్లీ: బీజేపీ పార్లమెంటర పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు లైబ్రరీలోని బాలయోగి ఆడిటోరియంలో సమావేశం జరుగుతోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై పార్లమెంటు సభ్యులు ప్రధాని మోడీని అభినందించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లే అంశంపై ఎంపీలకు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.