ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 103వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 103వ రోజు పాదయాత్రను తాళ్లూరు శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర రజానగరం గిరిజన కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, తిమ్మాయపాలెం మీదుగా అద్దంకి వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా కుసుకుపాడులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అద్దంకిలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.