ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 101వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు. ఉదయం చీమకుర్తి నుంచి ప్రారంభమైన జగన్ 101వ రోజు పాదయాత్ర చీమలమర్రి వరకు చేరుకుంది. చీమలమర్రిలో జగన్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు భారీగా అభిమానులు, గ్రామస్థులు తరలివచ్చారు. జగన్కు తమ సమస్యలను చెప్పుకున్నారు. పాదయాత్ర మంచికలపాడు, బండ్లమూడి, తొర్రగుడిపాడు క్రాస్, పల్లామిల్లి మదుగా గాడిపర్తివారిపాలెం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా పల్లామల్లిలో జగన్ జనంతో మమేకం కానున్నారు.