రాజమహేంద్రవరం : ఉద్యోగులు సేవాభావంతో పని చేయాలని మంత్రి చినరాజప్ప అన్నారు. ఇక్కడ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎసిబి అద్భుతంగా పని చేస్తోందని ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధులను ఎసిబి పరిధిలోకి తీసుకు రావాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో 16 కోట్ల రూపాయిల వ్యయంతో ఎసిబికి ఏడు నూతన భవనాలను నిర్మించామని ఆయన అన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఎసిబికి నూతన భవనాలు నిర్మిస్తామని ఆయన చెప్పారు.