బుగ్గరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాజరాజేశ్వరీదేవి, బుగ్గరామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పట్టణంలోని ఆలయం నుంచి గాంధీకట్ట, పోలీస్స్టేషన్ సర్కిల్, సీబీరోడ్డు, మెయిన్ బజారు మీదుగా ఊరేగించారు. ఉదయం రాజరాజేశ్వరీదేవి, బుగ్గరామలింగేశ్వరుడిని ప్రత్యేక వాహనంలో పుర వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కృష్ణారెడ్డి సభ్యులు రవిప్రసాద్, భూమా సూర్యనారాయణ, చంద్రశేఖర్, ఓబిరెడ్డి, శేషఫణి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.