న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఐఏఎస్ అధికారులు మండిపడ్డారు. ఢిల్లీలో ఇవాళ నిర్వహించిన ప్రెస్మీట్లో ఐఏఎస్ అధికారులు నల్ల రిబ్బన్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఐఏఎస్ అధికారిణి పూజ జోషి మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షూ ప్రకాశ్పై ఆప్ ఎమ్మెల్యేల దాడిని ఖండించారు. ఇందుకు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఐఏఎస్ అధికారులకు రాతపూర్వక క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోవడం కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.