విశాఖ: మన దేశంలో ఉన్న కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో సోషల్ ఐకాన్పై జరిగిన ప్రత్యేక ప్లీనరీలో చంద్రబాబు మాట్లాడారు. మనది వృద్ధి చెందుతున్న దేశం అని, వనరులను సమర్థంగా వాడితేనే ముందుకెళ్లగలమన్నారు. దేశం, ప్రజలు మారుతున్నారని, రాజకీయాలు మారాలి అని పేర్కొన్నారు. ప్రజల్లో సంతోషాన్ని పెంచేందుకు హ్యాపీ సండేలు ఏర్పాటు చేశామన్నారు.ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయని, సాంకేతికత పరిజ్ఞానం పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.