అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి నిన్న రాత్రి దుబాయిలో తన తుది శ్వాస విడిచారు.. శ్రీదేవి మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం, అభిమానులు షాక్ కు గురయ్యారు.. శ్రీదేవి మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. ఉదయం లేవగానే అందరూ ఈ వార్త చూసి షాక్ అయ్యారు… శ్రీదేవి మృతిపై దేశంలో ప్రముఖులు స్పందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా స్పందించారు.. ప్రస్తుతం విశాఖలో చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బహుభాషా నటిగా, ముఖ్యంగా తెలుగువారికి అత్యంత ఇష్టమైన కథానాయకగా ఎదిగారని అన్నారు. అసమానమైన తన అభినయంతో దేశం గర్వించదగ్గ నటిగా నిలిచిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు..