ఫిబ్రవరి 29 నుంచి ఏప్రిల్ 19 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి గంటా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీలు, ఆర్ఐవోలకు మంత్రి పలు సూచనలు చేశారు. ఫీజులు పెండింగ్ పేరుతో హాల్ టికెట్లు విద్యార్ధులకు ఇవ్వకుండా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ విద్యార్థికి హాట్ టిక్కెట్ల సమస్య రానీయద్దు అధికారులకు సూచించారు. యాప్ ద్వారా తమ సెంటర్ల సమాచారాన్ని తెలుసుకునే సౌలభ్యం విద్యార్ధులకు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులు మంత్రి ఆదేశించారు.