అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మరికొద్దిసేపటిలో ప్రారంభం కానున్నది. శాసనసభ సమావేవాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనపై సమావేశంలో చర్చిస్తారు. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన కేంద్ర హోంశాఖ వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఉద్యోగులు ఒక డిఎ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రేపటి కియా శంకుస్థాపన, విశాఖలో భాగస్వామ్య సదస్సుపై కూడా మంత్రివర్గం చర్చిస్తుంది.