న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిథి సంబిత్ స్వరాజ్ డిమాండ్ చేశారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసంలోనే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీపై ఎమ్మెల్యేలు దాడి చేశారంటే అంతకంటే అరాచకం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. అటువంటి ముఖ్యమంత్రికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.