మనకు జరిగిన అన్యాయంపై పోరాడాల్సిందేనని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ది చేస్తున్నందునే ప్రజలు మన వైపున నిలుస్తున్నారన్నారు. మన పోరాటం వ్యక్తులపై కాదని, మనకు జరిగిన అన్యాయంపైనే పోరాడుతున్నామన్నారు. మన కష్టం, తెలివితేటలు, ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు.