శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుప్వారా పోలీసు స్టేషన్ పరిధిలోని లాస్తియాల్ గ్రామంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. లాస్తియాల్ గ్రామంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయని బలగాలకు సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి భద్రతా బలగాలు అక్కడ తనిఖీలు నిర్వహించి.. 2 కేజీల అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలు, యూబీజీఎల్ షెల్స్, పిస్తోల్కు చెందిన 15 రౌండ్ల బుల్లెట్లు, ఏకే 47కు చెందిన 335 రౌండ్ల బుల్లెట్లతో పాటు ఏడు డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న కుప్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు.