లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. స్కూల్ డ్రస్ కొలతల పేరుతో విద్యార్థులను బట్టలు విప్పమని వేధించాడు. విద్యార్థినులను ఒక్కొక్కరిని ఓ తరగతి గదిలోకి పిలిచి.. యూనిఫాం కోసం కొలతలు తీసుకోవాలి. మీరు మీ బట్టలు విప్పండి అని ఆదేశించాడు. దీంతో విద్యార్థినులు భయపడిపోయారు. మొత్తానికి ఉపాధ్యాయుడి వికృత చేష్టలను ఉన్నతాధికారులు, పోలీసుల దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.