అఖిలపక్షంపై చర్చిస్తామని చంద్రబాబు చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఐ నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తొలుత అవిశ్వాసం ప్రవేశపెట్టాల్సింది టీడీపీనేనన్నారు. హోదా కోసం అయితే అఖిలపక్ష సమావేశానికి వస్తామని ప్యాకేజీలాంటి భిక్షాటన కోసమైతే రామని తేల్చి చెప్పారు. ఐదు కోట్ల మంది తెలుగువారిని బీజేపీ వెంట్రుకలతో పోల్చడం దారుణమని అన్నారు. ఏపీకే కాదు, తెలంగాణకూ అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ది రిటైల్ అవినీతి అయితే బీజేపీది హోల్సేల్ అవినీతి అని విమర్శించారు. డ్రామాలాడితే బీజేపీ, టీడీపీలకు మిగిలేదేమి ఉండదన్నారు.