ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం: ఉండవల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 12:34 PM

రాజమండ్రి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాజమండ్రిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ అవిశ్వాస తీర్మానానికి సీఎం చంద్రబాబు మద్దతివ్వాలన్నారు. పవన్‌ లాంటి సెలబ్రిటీలు చెప్పడంతో కవరేజ్‌ వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రం, కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వాలే నడుస్తున్నా.. రోడ్డెక్కి కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి వైసీపీ నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేలను అసెంబ్లిdకి పంపి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. చట్టంలో చెప్పినవి ఇంకా ఇవ్వలేదన్నారు. చట్టంలో లేనివి ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ఏం బయటపెడుతుందో చూద్దామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com