బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. జార్ఖండ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రలలో కాంగ్రెస్ను ఓడించిన విధంగానే కర్ణాటకలో కూడా ఆ పార్టీని ఓటమిపాలు చేస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి సాధించాలంటే వ్యవస్థలోనుంచి అవినీతిని తొలగించాలని అమిత్ షా అన్నారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ అంశంలో చేతకానితనాన్ని ప్రదర్శిస్తోందని ఆయన చెప్పారు.