బెంగళూరు : రైల్వే మంత్రి పియూష్ గోయెల్ మైసూర్ నుంచి బెంగళూరుకు ప్రయాణీకులతో రైల్లో కలిసి ప్రయాణించారు. అనంతరం బెంగళూరులో ఆయన మాట్లాడుతూ మైసూర్ టు బెంగళూరు ప్రయాణాన్ని ఆస్వాదించానని చెప్పారు. ప్రయాణీకులు ఈ సందర్భంగా చేసిన సూచనలు, ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయనీ, రైలు ప్రయాణంలో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అవి ఎంతగానో దోహదపడతాయని చెప్పారు.