న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసుపై సుప్రీంకోర్టు ఈ శుక్రవారం విచారణ చేపట్టనున్నది. వినీత్ దండా వేసిన పిల్ ఆధారంగా ఈ విచారణ జరగనున్నది. రెండు నెలలలోగా నీరవ్ మోదీని స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ఆ పిల్లో పిటీషనర్ వేడుకున్నారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలపైన కూడా సరికొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేయాలని ఆ పిల్లో డిమాండ్ చేశారు. పీఎన్బీ స్కామ్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను అడ్వకేట్ దండా కోరారు. పీఎన్బీ సుమారు 11300 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. ప్రజల హక్కులను కాపాడేందుకు ఈ కేసులో సుప్రీం జోక్యం చేసుకోవాలని పిల్లో కోరారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేని రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారని కూడా ఆ వ్యాజ్యంలో ఆరోపించారు.