పంజాబ్: సరిహద్దు భద్రతా దళాల సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఓ పాకిస్థాన్ స్మగ్లర్ హతమయ్యాడు. ఈ ఘటన పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో చోటుచేసుకుంది. మృతుడి వద్ద నుంచి 10 కేజీల హెరాయిన్, చైనా మేడ్ పిస్టల్, రెండు మ్యాగ్జిన్స్, 17 లైవ్ కార్ట్రిజ్జస్, పాక్ కరెన్సీ, సిమ్కార్డులో కూడిన రెండు మొబైల్ ఫోన్స్, 10 ఫీట్ల పొడవున్న ప్లాస్టిక్ పైపును స్వాధీనం చేసుకున్నారు.