ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 93వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 93వ రోజు పాదయాత్రను విప్పగుంట శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర చౌటపాలెం, లింగంగుంట, మాలేపాడు మీదుగా తిమ్మపాలెం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా చౌటపాలెంలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం తిమ్మపాలెం వద్ద జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.