అవిశ్వాసం పెడతామనడం ప్రచార ఆర్భాటం కోసమేనని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మంత్రివర్గం నుంచి వైదొలగడమనేది పార్టీ అధినాయకత్వం చేతిలో ఉందన్నారు. రాజీనామాలు చేసి మంత్రివర్గం నుంచి బయటకు రావాలని కొంత మంది కోరారన్నారు. వ్యక్తిగత విమర్శలు సరికాదని, పదవులను గౌరవించాలన్నారు.