ఏలూరు: విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని కేంద్రం పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు పరిష్కారం కాలేదన్నారు. హామీలను పరిష్కరించకపోవడంపై కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలన్నారు.