ప్రాణాలు అర్పించైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటం వృధాగా పోనివ్వమన్నారు. హోదాకు అనుకూలంగా లేని వారు ఆంధ్రా ద్రోహులేనన్నారు.