ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వత్సవాయిలో ఏసీబీకి పట్టుబడిన గృహ నిర్మాణ శాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 02:11 PM

కృష్ణా జిల్లా వత్సవాయిలో రెండు చోట్ల ఏబీసీ దాడులు నిర్వహించింది. వేర్వేరు చోట్ల ఏసీబీ నిర్వహించిన దాడుల్లో ఇద్దరు అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గృహ నిర్మాణ లబ్దిదారులకు దరఖాస్తు, బిల్లుల మంజూరులో లంచం డిమాండ్‌ చేసిన గృహ నిర్మాణ శాఖ ఏఈ రామాంజనేయ అప్పారావు, పంచాయతీ కార్యదర్శి కోటయ్యలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ దాడుల్లో గృహ నిర్మాణ శాఖ ఏఈ రామాంజనేయ అప్పారావు రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా, మరో చోట పంచాయతీ కార్యదర్శి కోటయ్య రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com