అమరావతి : తెలుగుదేశం తదితర పార్టీలతో పొత్తుకు సంబంధించిన అంశం బిజెపి అధిష్టానం పరిధిలోనిదని ఆ పార్టీ నాయకుడు, ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన బిజెపి కార్యక్తగా నడుచుకుంటానని ఆయన చెప్పారు. అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ఆయన అన్నారు. తన ఆరోగ్యం సహకరించనందుకే నిన్నటి సమావేశంనుంచి ముందుగానే బైటికి వచ్చానని ఆయన చెప్పారు.