పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిమ్మలగూడెంలో పోగొండ రిజర్వాయర్ను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గోదావరి నీటిని విశాఖ వరకు తరలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేశామని పేర్కొన్నారు.