ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన కెనడా ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 12:46 PM

అహ్మదాబాద్ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. నిన్న తాజ్ మహల్ అందాలను తిలకించిన ట్రూడూ, ఆయన భార్య సోఫియా, ముగ్గురు పిల్లలు.. ఇవాళ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రూడూ భార్య సోఫియా చరఖా తిప్పారు. ఈ సన్నివేశాన్ని ఆమె పిల్లలు ఎంజాయ్ చేశారు. గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ టెంపుల్‌ను సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు కెనడా ప్రధాని. అక్కడ ఆలయ నిర్వాహకులు జస్టిన్ ట్రూడూకు ఘనస్వాగతం పలికారు. అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో జరిగే ఎడ్యుకేషన్ అండ్ ఇన్వస్ట్ మెంట్ అనే అంశంపై ఆయన విద్యార్ధులతో డిస్కస్ చేయనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com