ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు నిమ్మలగూడెంలో పోగొండ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. మరికాసేపట్లో పోగొండ రిజర్వాయర్ను చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 1500 గిరిజన కుటుంబాలు, వేయి గిరిజనేత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. నిమ్మలగూడెంలో చంద్రబాబు పోగొండ రిజర్వాయర్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పోగొండ రిజర్వాయర్ ఆయకట్టు రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.