బెంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే మొహమ్మద్ హరిస్ కుమారుడు నలపాడ్, అతడి స్నేహితులు కలిసి బెంగుళూరులో ఓ వ్యక్తిని చితకబాదారు. ఈ సంఘటన శనివారం రాత్రి ఓ రెస్టారెంట్లో జరిగింది. ఆ కేసులో ఇరుక్కున్న నలపాడ్ ఇవాళ పోలీసులు ముందు లొంగిపోయాడు. రెండు రోజుల క్రితం రెస్టారెంట్లో భోజనం చేయడానికి వచ్చిన విద్వత్ అనే వ్యక్తిని నలపాడ్, అతడి స్నేహితులు చితకబాదారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అధికార కాంగ్రెస్ వెంటనే స్పందించింది. కాంగ్రెస్ నాయకుడు కూడా అయిన నలపాడును ఆరేండ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.