ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమవరం మావూళ్లమ్మకు ఎన్టీఆర్ తల్లి షాలిని వెండి కానుక!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 11:59 AM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గ్రామదేవతగా విలసిల్లుతున్న మావూళ్లమ్మ ఆలయాన్ని సందర్శించిన హీరో ఎన్టీఆర్ తల్లి షాలిని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వెండి కానుకను అందించారు. తన స్నేహితులతో కలసి ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అర్చుకులు, అధికారులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అమ్మవారికి షాలిని 350 గ్రాముల బరువైన వెండి పాత్రను కానుకగా అందించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించిన పురోహితులు ఆశీర్వచనం చదివారు. షాలినీ వచ్చారని తెలుసుకున్న పలువురు ఎన్టీఆర్ అభిమానులు గుడి వద్దకు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com